బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా కేసీఆర్

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. ఆసుపత్రిలో పార్టీ అధినేత ఎమ్మెల్యే కేసీఆర్, ఆయన వద్ద ఉన్న కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ముఠా గోపాల్, పద్మారావులు తప్పా మిగతా ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా, శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి ప్రతిపాదించారు. డిప్యూటీ లీడర్‌ను నియమించే అధికారం కేసీఆర్‌కు కల్పిస్తూ బీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలంతా ప్రత్యేక బస్సులు అసెంబ్లీకి వెళ్లారు. ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Next Story

Most Viewed